|
|
by Suryaa Desk | Tue, Oct 28, 2025, 05:33 PM
వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ తెలుగు తమిళ ద్విభాషా చిత్రాన్ని తాత్కాలికంగా 'సూర్య 46' అనే టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ సినిమాలో సూర్యకి జోడిగా మమిత బైజు నటిస్తుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా నిర్మాత నాగ వంశి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమా షూటింగ్ 55% పూర్తి అయ్యినట్లు వెల్లడించారు. ఈ చిత్రం తెలుగు మరియు తమిళంలో విడుదల కానుంది. ఈ చిత్రంలో రవీనా టాండన్, భవాని శ్రీ మరియు రాధికా శరాత్ కుమార్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి GV ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. సూర్యదేవర నాగా వంశి ఫార్చ్యూన్ ఫోర్ సినిమాలతో పాటు సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కింద ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.
Latest News