|
|
by Suryaa Desk | Mon, Oct 27, 2025, 04:42 PM
భను భోగవారపు దర్శకత్వంలో మాస్ రాజా రవి తేజా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ రాబోయే ఎంటర్టైనర్ కి 'మాస్ జాతర' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా అక్టోబర్ 31న విడుదల కానుంది. ఈ సినిమా యొక్క ప్రమోషనల్ కంటెంట్ కి భారీ స్పందన లబించింది. ఇటీవలే మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఈరోజు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. తాజాగా ఇప్పుడు ఈ ఈవెంట్ ని ఇప్పుడు మేకర్స్ క్యాన్సల్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా రేపు జరుగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా ట్రైలర్ ని కూడా విడుదల చేయటానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. ప్రముఖ తెలుగు నటుడు నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, ఆది ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల మహిళా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రంలో రవితేజ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారిగా కనిపించనున్నారు. ఈ సినిమాకి సంగీతాన్ని భీమ్స్ సెసిరోలియో ట్యూన్ చేశారు. నాగ వంశి మరియు సాయి సౌజన్య సీతారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ మరియు శ్రీఖర స్టూడియోస్ బ్యానర్లలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Latest News