|
|
by Suryaa Desk | Mon, Oct 27, 2025, 02:54 PM
టాలీవుడ్ యువ నటుడు అడివి శేష్ రాబోయే పాన్-ఇండియా చిత్రం 'డకాయిట్' అనే యాక్షన్ డ్రామాతో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధం అవుతున్నాడు. ఈ చిత్రం యొక్క అనౌన్స్మెంట్ వీడియో ప్రేమపై ప్రత్యేకమైన టేక్తో చాలా సంచలనం సృష్టించింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ని అక్టోబర్ 28న మధ్యాహ్నం 1:08 గంటలకి వెల్లడి చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుంది. 'క్షణం' మరియు 'గూడాచారి'తో సహా పలు తెలుగు బ్లాక్బస్టర్లకు ఫోటోగ్రఫీ డైరెక్టర్గా పనిచేసిన తర్వాత షానీల్ డియో తన తొలి ఫీచర్ దర్శకుడిగా ఈ సినిమాతో పరిచయం అవుతున్నాడు. అడివి శేష్ మరియు షానీల్ డియో ఈ చిత్రానికి కథ మరియు స్క్రీన్ ప్లే కూడా అందించారు. ఈ ప్రాజెక్ట్ను సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ ప్రాజెక్ట్ను నిర్మించారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి, జైన్ మేరీ ఖాన్, అనురాగ్ కశ్యప్, కామక్షి భాస్కర్లా కూడా నటించారు. ఈ సినిమాకి భీమ్స్ సెసిరోలియో ట్యూన్లను కంపోజ్ చేస్తున్నారు.
Latest News