|
|
by Suryaa Desk | Sat, Oct 25, 2025, 04:59 PM
బహుముఖ కోలీవుడ్ నటుడు ధనుష్ దర్శకత్వం వహించిన మరియు నటించిన 'ఇడ్లి కొట్టు' చిత్రం అక్టోబర్ 1, 2025న విడుదల అయ్యింది. ఈ చిత్రంలో నిత్య మీనన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. అరుణ్ విజయ్, రాజ్ కిరణ్, పార్థిబాన్, షాలిని పండేయ్ మరియు సత్యరాజ్ ఈ సినిమాలో సహాయక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ఫ్లిక్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫారం ఈ చిత్రం అక్టోబర్ 29, 2025న తమిళం, తెలుగు, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషలలోప్రదర్శించబడుతుందని అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాకి జివి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. వండర్బార్ ఫిల్మ్స్ మరియు డాన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మించాయి.
Latest News