|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 03:14 PM
జాతీయ అవార్డు గెలుచుకున్న కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ త్వరలో విడుదల కానున్న పాన్-ఇండియా సోషల్ డ్రామా 'కుబేర' లో కనిపించనున్నారు. ఈ సినిమా జూన్ 20న విడుదల కానుంది. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ ఇటీవలే విడుదల కాగా భారీ స్పందన లభించింది. ఈ సినిమాని మేకర్స్ భారీగా ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రముఖ నటుడు అక్కినేని నాగచైతన్య తో ఒక చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ చిట్ చాట్ లో డైరెక్టర్ శేఖర్ కమ్ముల మరియు నటుడు నాగార్జున సినిమాకి సంబందించిన విషయాలని వెల్లడించారు. ఈ ఫుల్ చిట్ చాట్ వీడియోని మేకర్స్ యూట్యూబ్ లో విడుదల చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ సినిమాలో రష్మిక మందన మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాని శేఖర్ కమ్ముల యొక్క అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్తో కలిసి ప్రముఖ చిత్రనిర్మాతలు సునీల్ నారంగ్ మరియు పి రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జిమ్ సర్బ్, దాలిప్ తాహిల్ మరియు సయాజీ షిండే కీలకమైన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా హ్యాండిల్ నికేత్ బొమ్మి, ఎడిటింగ్ కార్తీక శ్రీనివాస్ అందిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.
Latest News