|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 05:33 PM
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైన్ అప్ లో భారీ ప్రాజెక్ట్ ఉన్నాయి. వాటిలో ఒకటి టాలెంటెడ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న 'OG'. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే మేకర్స్ ఈ సినిమా యొక్క షూటింగ్ ని పూర్తి చేసారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా యొక్క సీడెడ్ రైట్స్ ని ప్రముఖ ప్రొడ్యూసర్ నాగ వంశి 24 కోట్లకి సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ జాపనీస్ నటుడు కాజుకి కీటమురా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, షామ్ మరియు హరీష్ ఉత్తమన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ పీరియాడికల్ గ్యాంగ్స్టర్ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ గ్యాంగ్స్టర్ డ్రామా సెప్టెంబర్ 25న విడుదల కానుంది.
Latest News