|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 09:08 PM
ముంబైలో ఫోటోగ్రాఫర్ల హడావిడి మామూలుగా ఉండదు. బయట కనిపించే సెలబ్రిటీల ఫొటోలు తీస్తూ వారిని ఇబ్బంది పెడతూ ఉంటారు. తాజాగా ఆ ఫొటోగ్రాఫర్లపై హీరోయిన్ సమంత అసహనం వ్యక్తం చేశారు. ముంబైలోని ఓ జిమ్ నుంచి ఆమె బయటకు రాగానే వారంతా ఫొటోలు, వీడియోలు తీస్తూ వెంటబడ్డారు. సమంత వద్దని చెప్పినా వినకపోవడంతో.. వారిపై కోపంగా అరుస్తూ కారు ఎక్కి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Latest News