![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 02:46 PM
అఖిల్ పాల్ మరియు అనాస్ ఖాన్ దర్శకత్వంలో టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'ఐడెంటిటీ' తెలుగు వెర్షన్ జనవరి 24, 2025న విడుదలైంది. త్రిష కృష్ణన్ మరియు వినయ్ రాయ్ కూడా ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో కనిపించరు. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు మరియు జీ సినిమాలు ఛానల్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా జీ సినిమాలు ఛానల్ లో జూన్ 14న మధ్యాహ్నం 12 గంటలకి స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు ఛానల్ ప్రకటించింది. ఈ చిత్రంలో మందిరా బేడి, షామ్మీ తిలకన్, అజు వర్గీస్, అర్జున్ రాధకృష్ణన్, అర్చన కవి ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ గ్రిప్పింగ్ స్కోర్ అందించారు. సెంచరీ ఫిల్మ్స్ మరియు రాగం మూవీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు.
Latest News