![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 02:50 PM
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు భార్య తేజస్విని ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారింది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన విషయాలను అందులో షేర్ చేసుకుంటున్నారు.తాజాగా తేజస్విని తన సమ్మర్ వెకేషన్ ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది.గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా మారింది ల్ రాజు సతీమణి తేజస్విని. ఇంతకు ముందు అప్పుడప్పుడు మాత్రమే ఇన్ స్టా గ్రామ్ లో పోస్టులు పెట్టేది. అవి కూడా ఎక్కువగా భర్త దిల్ రాజు, తనయుడు అన్వి రెడ్డితో కలిసి దిగిన ఫోటోలు లేదా వీడియోలు షేర్ చేసేది. అయితే ఇప్పుడు తేజస్విని సోషల్ మీడియాలో చురుగ్గా వ్యవహరిస్తోంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన విషయాలు, ఫొటోలు, వీడియోలను తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తోంది.ఆ మధ్యన భర్త దిల్ రాజుతో కలిసి ఫారిన్ వెకేషన్ వెళ్ళినప్పుడు సైతం అక్కడ తీసుకున్న ఫోటోలు వీడియోలు షేర్ చేసింది తేజ స్విని. తాజగా మరికొన్ని ఆసక్తికర ఫొటోలను తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేసింది దిల్ రాజు భార్య.ఆ మధ్యన తేజస్విని ఫ్రాన్స్ వెళ్లిన సంగతి తెలిసిందే. సమ్మర్ వెకేషన్ లో భాగంగా అక్కడికి వెళ్లిన ఆమె ప్రకృతి అందాలను ఆస్వాదించింది. అలాగే ప్రఖ్యాత ఈఫిల్ టవర్ ను కూడా సందర్శించి మురిసిపోయింది.తాజాగా తన ఫ్రాన్స్ పర్యటనకు సంబంధించి మరికొన్ని ఫొటోలను షేర్ చేసింద తేజస్విని. ఇందులో ఈఫిట్ టవర్ దగ్గర తెల్లని చీరలో ఎంతో అందంగా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.కాగా దిల్ రాజు మొదటి భార్య అనిత చనిపోవడంతో 2020లో తేజస్వినిని రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరికి ఒక అన్వి రెడ్డి బాబు ఉన్నాడు. ఇక ల విషయానికి వస్తే.. దిల్ రాజు బ్యానర్ లో నితిన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం తమ్ముడు రిలీజ్ కు రెడీ అవుతోంది.