|
|
by Suryaa Desk | Fri, Nov 07, 2025, 03:02 PM
బాలీవుడ్ ప్రముఖ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ఇంట ఆనందం వెల్లివిరిసింది. ఈ స్టార్ కపుల్ శుక్రవారం తల్లిదండ్రులయ్యారు. కత్రినా కైఫ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను వారు స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. 2021 డిసెంబర్ 9న రాజస్థాన్ వేదికగా కత్రినా, విక్కీ కౌశల్ వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. పెళ్లయిన నాటి నుంచి కత్రినా గర్భవతి అయ్యారంటూ పలుమార్లు వార్తలు వచ్చాయి. అయితే, వాటన్నింటికీ తెరదించుతూ ఈ ఏడాది సెప్టెంబర్ 23న తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ఈ జంట అధికారికంగా ప్రకటించింది. అప్పట్లో బేబీ బంప్తో ఉన్న ఫొటోను షేర్ చేసిన కత్రినా, "ఆనందం నిండిన హృదయాలతో మా జీవితంలోని కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాం" అని పేర్కొన్నారు.
Latest News