|
|
by Suryaa Desk | Sun, Nov 02, 2025, 03:09 PM
దర్శకుడు సందీప్ రెడ్డి, రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున నటించిన 'శివ' సినిమా గురించి మాట్లాడుతూ, ఆ సినిమా తనను ఎంతగానో ప్రభావితం చేసిందని, దాని వల్లే తాను దర్శకుడిగా మారానని తెలిపారు. నవంబర్ 14న 'శివ' సినిమా రీ-రిలీజ్ కానున్న నేపథ్యంలో, ఆ సినిమాలోని యాక్షన్, కథ, సంగీతం, నాగార్జున నటన తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, కొన్ని సన్నివేశాలు తన మనసులోంచి ఎప్పటికీ పోవని సందీప్ రెడ్డి అన్నారు. 1990లో విడుదలైన ఈ సినిమా 35 ఏళ్ల తర్వాత తిరిగి ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Latest News