|
|
by Suryaa Desk | Wed, Oct 29, 2025, 06:51 PM
కోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్ తన తదుపరి చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'టెరే ఇష్క్ మెయిన్' అనే టైటిల్ ని లాక్ చేసారు. టెరే ఇస్క్ మెయిన్ రాంజనా మరియు అతుంగి రే తరువాత బాలీవుడ్ దర్శకుడితో ధనుష్ యొక్క మూడవ చిత్రం. కృతి సనోన్ ఈ సినిమాలో మహిళా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే మేకర్స్ ఈ సినిమాలోని ఫస్ట్ సింగల్ ని విడుదల చేయగా భారీ స్పందన లభించింది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. AR రెహ్మాన్ ఈ చిత్రానికి ట్యూన్లను కంపోజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి హిమాన్షు శర్మ మరియు నీరాజ్ యాదవ్ కథ, స్క్రీన్ ప్లే మరియు డైలాగ్లను అందిస్తున్నారు. హిమాన్షు శర్మ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 25, 2025న విడుదల కానుంది.
Latest News