|
|
by Suryaa Desk | Tue, Oct 28, 2025, 06:04 PM
మారి సెల్వరాజ్ దర్శకత్వంలో కోలీవుడ్ యువ నటుడు ధ్రువ్ విక్రమ్ మరియు అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన బైసన్ అకా 'బైసన్ కాలమాడన్' కొంచెం నెమ్మదిగా ప్రారంభమైంది కానీ తరువాత ఈ చిత్రం బాక్స్ఆఫీస్ వద్ద అద్భుతంగా పుంజుకుంది. ఈ చిత్రం కుల వివక్షను అధిగమించి క్రీడలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు కృషి చేసిన కబడ్డీ ప్లేయర్ మానతి గణేశన్ జీవితం ఆధారంగా రూపొందించబడింది. బైసన్ మొదట్లో కొద్దిగా నెమ్మదించింది, కానీ ప్రతి రోజు గడిచేకొద్దీ,చిత్రం కలెక్షన్లలో ఘన వృద్ధిని నమోదు చేసింది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా విడుదలైన పది రోజులలో ప్రపంచవ్యాప్తంగా 55 కోట్ల గ్రాస్ ని వాసులు చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. బైసన్ కోటికి పైగా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో లాల్, పశుపతి, రాజిష విజయన్, కళైయారసన్ ఇతరుల ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్ మరియు నీలం స్టూడియోస్ బ్యానర్లపై సమీర్ నాయర్, దీపక్ సెగల్, పా.రంజిత్ మరియు అదితి ఆనంద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి నివాస్ కె. ప్రసన్న స్వరాలు సమకూర్చారు.
Latest News