|
|
by Suryaa Desk | Sat, Oct 25, 2025, 06:45 PM
భను భోగవారపు దర్శకత్వంలో మాస్ రాజా రవి తేజా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ రాబోయే ఎంటర్టైనర్ కి 'మాస్ జాతర' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా అక్టోబర్ 31న విడుదల కానుంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం విడుదల నవంబర్ 1కి వాయిదా పడినట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వస్తున్నాయి. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రానున్న రోజులలో ఈ విషయం పై క్లారిటీ రానుంది. ఈ చిత్రంలో శ్రీలీల మహిళా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రముఖ తెలుగు నటుడు నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, ఆది ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారిగా కనిపించనున్నారు. ఈ సినిమాకి సంగీతాన్ని భీమ్స్ సెసిరోలియో ట్యూన్ చేశారు. నాగ వంశి మరియు సాయి సౌజన్య సీతారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ మరియు శ్రీఖర స్టూడియోస్ బ్యానర్లలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Latest News