|
|
by Suryaa Desk | Fri, Oct 24, 2025, 08:06 PM
కోలీవుడ్ నటుడు విశాల్ 'మకుటం' సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో దుషారా విజయన్ కథానాయికగా నటిస్తుండగా, అంజలి కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా డబ్బింగ్ ని పూజ కార్యక్రమాలతో ప్రారంభించినట్లు ప్రకటించారు. సాంకేతిక బృందంలో సినిమాటోగ్రఫీగా రిచర్డ్ M. నాథన్, ఎడిటింగ్ గా ఎన్.బి.శ్రీకాంత్, ఆర్ట్ డైరెక్షన్ కి దురైరాజ్ ఉన్నారు. రవి అరసు కథ అందించగా, విశాల్ స్వయంగా స్క్రీన్ ప్లే అందించాడు. G.V. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్కి 99వ నిర్మాణ మైలురాయిగా ఆర్బి చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Latest News