|
|
by Suryaa Desk | Fri, Oct 24, 2025, 04:49 PM
తుషార్ జలోటా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ నటీనటులు సిధార్థ్ మల్హోత్రా మరియు జాన్వి కపూర్ ప్రధాన పాత్రలలో నటించిన హిందీ రోమ్-కామ్ ఎంటర్టైనర్ 'పరామ్ సుందరి' ఇటీవలే విడుదల అయ్యింది. ఈ చిత్రం విడుదల తర్వాత విమర్శకుల నుండి మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో రెంటల్ బేస్ పై స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. తాజాగా ఇప్పుడు ఈ రొమాంటిక్ కామెడీ ప్రైమ్ వీడియోలో ఈరోజు నుండి ఉచితంగా ప్రసారానికి అందుబాటులోకి వచ్చినట్లు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు డిజిటల్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. సచిన్ - జిగర్ ఈ చిత్రానికి సౌండ్ట్రాక్ ని అందించారు. ఈ సినిమాలో రెంజీ పానికర్, సిద్ధార్థ శంకర్, మంజోట్ సింగ్, సంజయ్ కపూర్ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మాడాక్ ఫిల్మ్స్కు చెందిన దినేష్ విజయన్ కేరళ నేపథ్యంలో ఈ చిత్రం సెట్ను నిర్మించగా, అభిషేక్ బెనర్జీ ప్రత్యేక అతిధి పాత్రలో కనిపించాడు.
Latest News