![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jun 25, 2025, 03:49 PM
ప్రముఖ దర్శకుడు త్రివిక్రామ్ శ్రీనివాస్ ఇటీవలే 'సంక్రాంతికి వస్తున్నాం' తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్న విక్టరీ వెంకటేష్తో ఒక సినిమాని చేస్తున్నట్లు సమాచారం. త్రివిక్రామ్ ఇంతకుముందు వెంకీతో ఒక సినిమా ప్రకటించాడు కాని తెలియని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. వెంకటేష్ మరియు త్రివిక్రామ్ కుటుంబ ప్రేక్షకులలో భారీ ఫాలోయింగ్ కలిగి ఉన్నారు. ఈ సినిమా మల్టీస్టారర్ అని టాక్. మరొక ప్రధాన పాత్రలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని సెలెక్ట్ చేసినట్లు టాక్. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ఈ సినిమాలో మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా షూటింగ్ ని మూవీ మేకర్స్ ఆగష్టులో ప్రారంభించటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందించనున్నట్లు సమాచారం. సూర్యదేవర రాధకృష్ణ హారికా మరియు హాసిన్ క్రియేషన్స్ పతాకంపై ఈ బిగ్గీని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన కీలక అప్డేట్స్ ని మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
Latest News