|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 04:29 PM
బ్లాక్బస్టర్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి "ది రాజా సాబ్" అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ హర్రర్ కామెడీ యొక్క టీజర్ ని మేకర్స్ ఇటీవలే విడుదల చేయగా భారీ స్పందన లభించింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క సీడెడ్ రైట్స్ ని మైత్రి మూవీ బ్యానర్ సొంతం చేసుకున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ ఈ సినిమాలో మహిళా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, సత్యరాజ్, జరీనా వహాబ్, వరలక్ష్మి శరత్కుమార్, యోగి బాబు, జిషు సేన్ గుప్తా, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.
Latest News