|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 06:42 PM
ప్రశాంత్ నీల్తో ఎన్టిఆర్ రాబోయే ప్రాజెక్ట్ సినీ ప్రేమికులలో అపారమైన ఆసక్తిని సృష్టిస్తోంది. ఈ చిత్రానికి డ్రాగన్ అని పేరు పెట్టనున్నట్లు నివేదికలు వస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆర్ఎఫ్సిలో జరుగుతింది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే నటి ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో టైగర్ టైగర్ బర్నింగ్ బ్రైట్ అనే కాప్షన్ ని ఇచ్చింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. 1950 లలో మాదకద్రవ్యాల మాఫియాకు అపఖ్యాతి పాలైన మాయన్మార్, ఉత్తర థాయిలాండ్ మరియు తూర్పు మయన్మార్ పాల్గొన్న గోల్డెన్ ట్రయాంగిల్ చుట్టూ ఈ చిత్రం తిరుగుతుందని నివేదికలు ఉన్నాయి. మైథ్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టిఆర్ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. టోవినో థామస్ ఈ చిత్రంలో శక్తివంతమైన పాత్ర పోషిస్తున్నట్లు టాక్. భువనా గౌడ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా ఉన్నారు. రవి బస్రుర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఈ సినిమా జూన్ 25, 2026న విడుదల కానుంది.
Latest News