|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 04:08 PM
టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'OG' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఇటీవలే మేకర్స్ ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకున్నారు. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా యొక్క సీడెడ్ రైట్స్ కోసం స్టార్ ప్రొడ్యూసర్ నాగ వంశి పోటీ పడుతున్నట్లు సమాచారం. ఈ సినిమా హక్కులను సంపాదించడానికి అతను ఒక మంచి మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరొక అగ్రశ్రేణి నిర్మాత కూడా ఈ సినిమా యొక్క ఆంధ్రప్రదేశ్ హక్కులను ఒక ఫాన్సీ మొత్తానికి పొందాలని యోచిస్తున్నాడు అని లేటెస్ట్ టాక్. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో జాపనీస్ నటుడు కాజుకి కీటమురా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, షామ్ మరియు హరీష్ ఉత్తమన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ పీరియాడికల్ గ్యాంగ్స్టర్ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ గ్యాంగ్స్టర్ డ్రామా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Latest News