|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 03:52 PM
కోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్ యొక్క రాబోయే చిత్రం 'కుబేర' జూన్ 20, 2025న విడుదల కావడానికి సన్నద్ధమైంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సామాజిక-రాజకీయ నాటకంలో నాగార్జున ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. రష్మిక మాండన్న ఈ చిత్రంలో మహిళా ప్రధాన పాత్రలలో నటించింది. ఈ చిత్రం సీజన్లో అత్యంత ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇటీవలే మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ అన్ని బాషలలో 30 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో జిమ్ సర్బ్, దాలిప్ తాహిల్ మరియు సయాజీ షిండే కీలకమైన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా హ్యాండిల్ నికేత్ బొమ్మి, ఎడిటింగ్ కార్తీక శ్రీనివాస్ అందిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి మరియు అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావు భారీ బడ్జెట్తో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Latest News