![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 01:57 PM
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' అనే చిత్రంతో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పాన్-ఇండియన్ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ యాక్షన్ డ్రామా విడుదల మరోసారి వాయిదా పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతకుముందు జూలై 4, 2025న విడుదలకి ఈ సినిమా షెడ్యూల్ చేయబడింది. కాని నితిన్ యొక్క తమ్ముడు ఇప్పటికీ ఆ స్లాట్ను కలిగి ఉండటంతో ఇప్పుడు జూలై 25, 2025న కింగ్డమ్ విడుదల కానున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ప్రస్తుతానికి అధికారిక అప్డేట్ మేకర్స్ నుండి రావలిసి ఉంది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్నురి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కథ కూడా గౌతమ్ రాసుకున్నారు. ఈ చిత్రంలో భగ్యాశ్రీ బోర్స్ మహిళా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రంలో నవ్య స్వామి, సత్య దేవ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. కొంతకాలంగా నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రంలో విజయ్ స్పై ఏజెంట్గా కనిపించనున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
Latest News