![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 12:56 PM
ప్రపంచానికి భారత్ ఇచ్చిన బహుమతి యోగా అని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు. జూన్ 21న యోగా దినోత్సవాన్ని అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ విషయంపై ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ''ఫోకస్ వల్ల ఫిట్నెస్ పెరుగుతుంది. యోగా చేస్తే ఈ రెండూ వస్తాయి. యెగా డేను సెలబ్రేట్ చేసుకుందాం.. ప్రపంచానికి మన దేశం ఇచ్చిన బహుమతి యోగా. సరిహద్దులు దాటి దీన్నిసెలబ్రేట్ చేసుకుందాం'' అని రాసుకొచ్చారు. యోగాకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా అంతర్జాతీయ యోగా మాసోత్సవాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల్లో యోగా డేను నిర్వహిస్తున్నారు. దీనిపై ప్రధాని మోదీ కూడా హర్షం వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్లో యోగా దినోత్సవంపై ప్రజల్లో ఉత్సాహాన్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని నరేంద్ర మోదీ అన్నారు. ఏపీ ప్రజలు చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. జూన్ 21న ఏపీలో యోగా దినోత్సవం నిర్వహించుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
Latest News