![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 06:21 PM
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఒకపక్క డైరెక్టర్ గా సినిమాలుచేస్తూనే .. ఇంకోపక్క నిర్మాతగా మారి మంచి మంచి సినిమాలను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం లోకేష్ నిర్మిస్తున్న చిత్రం బెంజ్. రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలి విలన్ గా కనిపిస్తున్నాడు. ఖైదీ సినిమాతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేశాడు. ఈ సినిమా తరువాత విక్రమ్, లియో సినిమాలను లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో తెరకెక్కించాడు. ఇప్పుడు బెంజ్ ను కూడా LCU లోకి తీసుకొచ్చాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి నివిన్ పౌలి క్యారెక్టర్ ప్రోమోను రిలీజ్ చేశారు. బెంజ్ సినిమాలో నివిన్.. వాల్టర్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. బెంజ్ కోసం లోకేష్.. ముగ్గురు హీరోయిన్లను సెలెక్ట్ చేశాడట. వారెవరో కాదు.. స్టార్ బ్యూటీస్ సంయుక్త మీనన్, ప్రియాంక మోహన్, మడోన్నా సెబాస్టియన్. లారెన్స్ సరసన ఈ ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారని సమాచారం. వీరేమి సినిమాలు లేక ఖాళీగా ఉన్నవారు కాదు. ముగ్గురు పెద్ద పెద్ద సినిమాల్లో నటిస్తున్నవారే. సంయుక్త మీనన్ ప్రస్తుతం ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ప్రియాంక మోహన్.. తెలుగులో OG సినిమా చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తికాగా రిలీజ్ కు రెడీ అవుతోంది. మడోన్నాను తీసుకోవడం వెనుక పెద్ద కథనే ఉంది. ఆమె లియోలో విజయ్ కు చెల్లిగా కనిపించింది. ఈ సినిమా సినిమాటిక్ యూనివర్స్ లో భాగం కాబట్టి.. మడోన్నాను తీసుకొని ఉంటారని సమాచారం. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. త్వరలోనే ఒక్కొక్కరి క్యారెక్టర్ ప్రోమోను రిలీజ్ చేయనున్నారని టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.
Latest News