![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 15, 2025, 05:43 PM
రాధా కృష్ణ రెడ్డి దర్శకత్వంలో జానార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రానికి 'జూనియర్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ పాన్-ఇండియన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో శ్రీలీల మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా జూలై 18, 2025న విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో జెనీలియా, రవిచంద్రన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ప్రతిష్టాత్మక వారాహి చలానా చిత్రం బ్యానర్ ఆధ్వర్యంలో రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాకి రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నారు.
Latest News