|
|
by Suryaa Desk | Sat, Nov 01, 2025, 08:45 PM
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులకు రెండో వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, యంగ్ హీరో అల్లు శిరీష్ తన ప్రేమకథను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కాబోయే భార్య నయనికతో తన పరిచయం వరుణ్ పెళ్లి వేడుకల్లోనే జరిగిందని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఆసక్తికర పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.2023 అక్టోబర్లో వరుణ్, లావణ్యల పెళ్లి సందర్భంగా నితిన్, శాలిని కందుకూరి ఓ పార్టీ ఇచ్చారు. ఆ పార్టీకి శాలిని తన స్నేహితురాలు నయనికను ఆహ్వానించింది. ఆ రాత్రే నేను, నయనిక తొలిసారి కలుసుకున్నాం. సరిగ్గా రెండేళ్ల తర్వాత ఇప్పుడు మేమిద్దరం ప్రేమలో ఉండి, నిశ్చితార్థం కూడా చేసుకున్నాం. భవిష్యత్తులో నా పిల్లలు మన కథ ఎలా మొదలైందని అడిగితే దటీజ్ హౌ ఐ మెట్ యువర్ మదర్' అని చెబుతాను అంటూ శిరీష్ తన పోస్ట్లో పేర్కొన్నారు. వరుణ్-లావణ్య జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ, తనను ఆదరించిన నయనిక స్నేహితులకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు.నిన్న అక్టోబర్ 31న అల్లు శిరీష్, నయనికల నిశ్చితార్థం హైదరాబాద్లో అంగరంగ వైభవంగా జరిగింది. అల్లు, కొణిదెల కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుకను ప్రైవేట్గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఉపాసన, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వంటి తారలంతా హాజరై సందడి చేశారు.నిశ్చితార్థ వేడుకలో శిరీష్ ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తుల్లో రాయల్ లుక్లో కనిపించగా, నయనిక సవ్యసాచి లెహంగాలో చూడముచ్చటగా మెరిసిపోయారు. తెలుగు సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 'గౌరవం' చిత్రంతో హీరోగా పరిచయమైన అల్లు శిరీష్కొత్త జంట', 'శ్రీరస్తు శుభమస్తు', 'ఒక్క క్షణం' వంటి చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
Latest News