|
|
by Suryaa Desk | Sat, Nov 01, 2025, 04:09 PM
ఆది సాయి కుమార్ తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధమవుతున్నాడు. యుగంధర్ ముని దర్శకత్వంలో రానున్న ఈ చిత్రానికి 'శంభాల' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఆది సాయి కుమార్ జియో సైంటిస్ట్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో అర్చన అయ్యర్ కథానాయికగా నటిస్తుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమాయొక్క ట్రైలర్ ని విడుదల చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త ని విడుదల చేసింది. ఈ చిత్రంలో స్వాసిక, రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధు నందన్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హన్స్ జిమ్మర్ వంటి ప్రముఖ హాలీవుడ్ కంపోజర్లతో పనిచేసిన శ్రీరామ్ మద్దూరి ఈ చిత్రానికి సంగీతం అందించారు. రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది.
Latest News