|
|
by Suryaa Desk | Fri, Oct 31, 2025, 09:26 AM
ప్రముఖ నటుడు శివాజీ రాబోయే క్రైమ్-కామెడీ-థ్రిల్లర్ తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నారు. 'సాంప్రదాయినీ సుప్పిని సుద్దపూసని' అనే టైటిల్ తో రానున్న ఈ చిత్రంలో శివాజీ కి జోడిగా లయ నటిస్తున్నారు. కొత్త దర్శకుడు సుధీర్ శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే మేకర్స్ ఈ సినిమా యొక్క మోషన్ పోస్టర్ ని విడుదల చేయగా భారీ స్పందన లాభించింది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా మోషన్ పోస్టర్ వన్ మిలియన్ డిజిటల్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని కూడా విడుదల చేసింది. హిట్ వెబ్ సిరీస్ 90's లో శివాజీతో కలిసి పనిచేసిన రోహన్ రాయ్, అలీ, ధన్రాజ్, రాఘవ, అన్నపూర్ణ, సమీర్, రఘు బాబు, ప్రిన్స్, ఇమ్మానుయేల్, చంద్ర, రామ్ ప్రసాద్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈటీవీ విన్తో కలిసి శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్పై శివాజీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
Latest News