|
|
by Suryaa Desk | Thu, Oct 30, 2025, 06:12 PM
టాలీవుడ్ నటుడు ఆది సాయికుమార్ రాబోయే మిస్టికల్ థ్రిల్లర్ 'శంభాల' తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మూవీ పై భారీ బజ్ ని సృష్టించింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని నవంబర్ 1న ఉదయం 11:05 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అర్చన అయ్యర్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రంలో స్వాసిక, రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధు నందన్, శివ కార్తీక్, ఇంద్ర అనిల్, శైలజ ప్రియా ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హన్స్ జిమ్మర్ వంటి ప్రముఖ హాలీవుడ్ కంపోజర్లతో పనిచేసిన శ్రీరామ్ మద్దూరి ఈ చిత్రానికి సంగీతం అందించారు. రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా షూనింగ్ పిక్చర్స్ బ్యానర్ కింద నిర్మిస్తున్నారు.
Latest News