|
|
by Suryaa Desk | Thu, Oct 30, 2025, 04:55 PM
'బాహుబలి' సిరీస్ మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. రెండు భాగాలను కలిపి 'బాహుబలి: ది ఎపిక్ వెర్షన్' పేరుతో ఒకే సినిమాగా విడుదల చేస్తున్నారు. రేపు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రాత్రి నుంచి ప్రీమియర్లు పడనున్నాయి.మరోవైపు, ఈ సినిమా చివర్లో 'బాహుబలి 3' గురించి ప్రకటన ఉంటుందంటూ కొద్ది రోజులుగా సాగిన ప్రచారానికి దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఫుల్ స్టాప్ పెట్టారు. ఆ ప్రకటన లేనప్పటికీ, అభిమానులను థ్రిల్ చేసే ఓ అదిరిపోయే సర్ప్రైజ్ను మాత్రం రివీల్ చేశారు.'బాహుబలి: ది ఎపిక్ వెర్షన్' ప్రదర్శనలో ఇంటర్వెల్ సమయంలో ఒక ప్రత్యేక 3D యానిమేషన్ టీజర్ను ప్రదర్శించనున్నట్లు రాజమౌళి స్వయంగా వెల్లడించారు. ఈ యానిమేషన్ సీక్వెన్స్ ద్వారా 'బాహుబలి' ప్రపంచాన్ని (యూనివర్స్ను) కొనసాగించనున్నట్లు ఆయన తెలిపారు. ఇషాన్ శుక్లా అనే దర్శకుడు ఈ యానిమేషన్ టీజర్ను రూపొందించినట్లు చెప్పారు. దీంతో, నిర్మాత శోభు యార్లగడ్డ కొద్ది రోజుల క్రితం చెప్పిన 'సర్ప్రైజ్' ఇదేనని స్పష్టమైంది.ఈ రాత్రి నుంచి 'బాహుబలి: ది ఎపిక్ వెర్షన్' ప్రీమియర్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో, 'బాహుబలి 3'పై సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరిగింది. ఈ వార్తలను నిర్మాత శోభు యార్లగడ్డ ముందే ఖండించారు. 'బాహుబలి 3' ప్రాజెక్ట్కు ఇంకా చాలా సమయం పడుతుందని, ప్రస్తుత వెర్షన్లో అలాంటి ప్రకటన ఏమీ లేదని స్పష్టం చేశారు. అయితే ఓ సర్ప్రైజ్ మాత్రం ఉంటుందని చెప్పి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు.తాజాగా సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రభాస్, రానాలతో కలిసి రాజమౌళి పాల్గొన్న ఓ చిట్చాట్ వీడియోలో ఈ విషయాలను పంచుకున్నారు. కథనం వేగంగా, సూటిగా ఉండేందుకు 'ఎపిక్ వెర్షన్'లో అవంతిక లవ్ స్టోరీతో పాటు కొన్ని పాటలు, సన్నివేశాలను తొలగించినట్లు వివరించారు. అందరూ అనుకుంటున్నట్లు 'బాహుబలి 3' లేదని తేల్చిచెప్పారు.
Latest News