|
|
by Suryaa Desk | Thu, Oct 30, 2025, 08:47 AM
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఒక చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ రాబోయే ఎంటర్టైనర్ కి మూవీ మేకర్స్ 'ది గర్ల్ఫ్రెండ్' అనే టైటిల్ ని లాక్ చేసారు. దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మానుయేల్, రావు రమేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా యొక్క ప్రమోషన్స్ ని మూవీ మేకర్స్ ప్రారంభించారు. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా యొక్క ఓవర్సీస్ రైట్స్ ని ప్రత్యంగిరా సినిమాస్ బ్యానర్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్ మరియు ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిర్మించగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 7, 2025న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో విడుదల కానుంది.
Latest News