|
|
by Suryaa Desk | Wed, Oct 29, 2025, 02:56 PM
స్టార్ హీరోయిన్ రష్మిక మాండన్న రాబోయే యాక్షన్-ప్యాక్డ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్ఫార్ములా ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ హీరోయిన్-ఆధారిత చిత్రానికి రావింద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి మేకర్స్ 'మైసా' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా యొక్క గ్లింప్సెని మేకర్స్ త్వరలో విడుదల చేయనున్నారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ఏమిటంటే, ప్రముఖ స్టంట్ మాస్టర్ ఆండీ లాంగ్ న్గుయెన్ ఈ సినిమా కోసం ఆన్ బోర్డులో ఉన్నట్లు సమాచారం. స్టంట్మ్యాన్ మరియు అతని బృందం భారతదేశంలోని కేరళలో ఈ సినిమా కోసం యాక్షన్ బ్లాక్లపై పని చేస్తున్నారు. తారక్ పొన్నప ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇంటర్నేషనల్ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండీ లాంగ్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. కీ టెక్నికల్ సిబ్బంది గురించిన వివరాలు వచ్చే వారం వెల్లడి కానున్నాయి. అజయ్ మరియు అనిల్ సయ్యపురెడ్డి నిర్మాతలు కాగా, సాయి గోపా సహ నిర్మాతగా ఉన్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జాక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
Latest News