|
|
by Suryaa Desk | Tue, Sep 02, 2025, 04:56 PM
టాలీవుడ్ యువ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవలే తన తదుపరి చిత్రాన్ని కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో ప్రకటించారు. ఈ చిత్రానికి కిష్కీందపురి అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. హర్రర్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమా సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క టీజర్ ని విడుదల చేయగా భారీ స్పందన లభించింది. ఈ సినిమా యొక్క ప్రమోషన్స్ ని మేకర్స్ ప్రారంభించారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా 2 గంటల 5 నిమిషాల రన్ టైమ్ ని కలిగి ఉన్నట్లు సమాచారం. చిన్మయ్ సలాస్కర్ కెమెరా క్రాంక్ చేయనుండగా, మనీషా ఎ దత్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, డి శివ కామేష్ ఆర్ట్ డైరెక్టర్ గా ఉన్నారు. నిరంజన్ దేవరమానే ఈ చిత్రానికి ఎడిట్ చేయనున్నారు. చైతన్ భరత్త్వాజ్ ఈ సినిమాకి సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గరిపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Latest News