|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 02:58 PM
రామ్ పోతినేని నటించిన తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 25 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.మహేశ్ బాబు.పి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చింది. మిశ్రమ స్పందన అందుకున్నప్పటికీ, రామ్ నటన, కథలోని కొన్ని భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో రామ్ సరసన యువ నటి భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించగా, కన్నడ స్టార్ ఉపేంద్ర ఓ అత్యంత కీలక పాత్రలో కనిపించారు. రావు రమేశ్, రాహుల్ రామకృష్ణ, మురళీ శర్మ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
Latest News