|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 08:53 AM
చిన్న సినిమాగా విడుదలై మంచి విజయం సాధించిన 'రాజు వెడ్స్ రాంబాయి' చిత్ర బృందాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అభినందించారు. గురువారం చిత్ర దర్శకుడు సాయిలు కంపాటి, నిర్మాత వేణు ఉడుగుల సహా ఇతర యూనిట్ సభ్యులను ఆమె శాలువాతో సత్కరించి ప్రశంసలు తెలిపారు. పూర్తి తెలంగాణ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం విజయం సాధించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు.కవితను కలిసిన వారిలో చిత్ర నిర్మాత వేణు ఉడుగుల, దర్శకుడు సాయిలు కంపాటి, సమర్పకులు పూజారి నాగేశ్వర్ రావు, సంగీత దర్శకుడు సురేశ్ బొబ్బిలి, గేయ రచయిత మిట్టపల్లి సురేందర్, నటుడు ఆదిత్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మురళీ పున్న తదితరులు ఉన్నారు. తమ చిత్ర విజయాన్ని అభినందించినందుకు వారు కవితకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సినిమా డిసెంబర్ 18నుండి ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాను వీక్షించవచ్చు.
Latest News