|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 03:02 PM
తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రీసెంటుగా ఓ వెబ్ సిరీస్ 'ఆహా' ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్ కి చెందిన సిరీస్ ఇది. అశ్విన్ .. గురు లక్ష్మణన్ .. పదినే కుమార్ .. శ్రీతు కృష్ణన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ కి జస్విని దర్శకత్వం వహించారు. డిసెంబర్ 5 నుంచి ప్రతి శుక్రవారం ఎపిసోడ్స్ వదులుతూ వస్తున్నారు. ఇంతవరకూ వదిలిన 5 ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం.
కథ: 'ధూల్ పేట్ పోలీస్ స్టేషన్' పరిధిలో దసరా నవరాత్రులకు సంబంధించిన ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆ సమయంలోనే ఆ ఊరికి కొత్త పోలీస్ ఆఫీసర్ గా వెట్రి మారన్ (అశ్విన్) వస్తాడు. అక్కడ రాజకీయాల ముసుగులో ఏ స్థాయిలో రాక్షసత్వం ఉందనేది వెట్రి మారన్ కి తెలుసు. అదే పోలీస్ స్టేషన్ లో మాసాని (పదినే కుమార్) కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఉంటుంది. అమ్మవారి భక్తురాలైన మాసానికి జరగబోయే కొన్ని సంఘటనలు ముందుగానే తెలుస్తూ ఉంటాయి. మూడు హత్యలు జరగనున్న విషయం కూడా ఆమెకి అలాగే తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆమె తనతో పాటు పనిచేస్తున్న మిగతా పోలీస్ లకు చెబుతుంది. ఆమెకి అలా అనిపించిందంటే తప్పకుండా జరుగుతుందని తెలిసి ఉండటం వలన, వాళ్లంతా కూడా ఆందోళన చెందుతారు. ఎందుకంటే 'ధూల్ పేట్ శంకర్' కి చెందిన మనుషులు శత్రువులపై పగ తీర్చుకునే పనిలో ఉన్నారనే విషయం వాళ్లకి తెలుసు. ఊహించినట్టుగా ఆ ఊళ్లో మూడు హత్యలు జరుగుతాయి. ఆ ముగ్గురులో 'ఉమాపతి' కూతురు 'సంధ్య' కూడా ఉండటంతో ఊరంతా ఉలిక్కి పడుతుంది. సంధ్య బంగారు నగలు దొంగతనంగా అమ్మడానికి వెళ్లిన 'సుకుమార్' పోలీసులకు పట్టుబడతాడు. ఉమాపతి ఐస్ మిల్ లో సుకుమార్ పనిచేస్తూ ఉంటాడు. తాను .. సంధ్య ప్రేమించుకున్నామనీ, తనకి ఆమెనే ఆ నగలు ఇచ్చిందని సుకుమార్ చెబుతాడు. సంధ్యను తాను చంపలేదనీ, ఎవరు చంపారో తెలియదని అంటాడు. దాంతో వెట్రి మారన్ రంగంలోకి దిగుతాడు. సంధ్యను హత్య చేసింది ఎవరు? మిగతా రెండు హత్యల వెనుక ఎవరున్నారు? ధూల్ పేట్ లో ఏం జరుగుతుంది? అనేది కథ.
Latest News