![]() |
![]() |
by Suryaa Desk | Wed, May 21, 2025, 10:03 PM
అక్షయ్ కుమార్, మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ హిస్టారికల్ కోర్ట్రూమ్ డ్రామా 'కేసరి చాప్టర్ 2' గ్రాండ్ గా విడుదల అయ్యింది మరియు భారీ స్పందనను అందుకుంది. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాధవన్ మరియు అనన్య పాండే కూడా కీలక పాత్రల్లో ఉన్నారు. ఈ చిత్రం జల్లియన్వాలా బాగ్ ఊచకోత తరువాత జరిగిన న్యాయస్థానం యుద్ధం చుట్టూ తిరుగుతుంది. కరణ్ జోహార్ దీనిని నిర్మించారు. కేసరి చాప్టర్ 2 ఇప్పుడు తెలుగులో మే 23న విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ సినిమాని తెలుగులో ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ సురేష్ ప్రొడక్షన్స్ విడుదల చేస్తుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ బుకింగ్స్ ఓపెన్ అయ్యినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రొడక్షన్ హౌస్ అధికారికంగా సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. రెజీనా కాసాండ్రా, సైమన్ పైస్లీ డే, అమిత్ సియాల్ మరియు ఇతరులు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, లియో మీడియా కలెక్టివ్ మరియు కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సౌండ్ట్రాక్ను షాష్వాట్ సచ్దేవ్ స్వరపరిచారు, కవితా సేథ్ మరియు కనిష్క్ సేథ్ సంగీతాన్ని అందించారు.
Latest News