|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 03:35 PM
కమల్ హాసన్ యొక్క ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా 'థగ్ లైఫ్' కి మణి రత్నం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ని మేకర్స్ ఇటీవలే ప్రారంభించారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ 40 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో సిలంబరసన్ టిఆర్ కీలక పాత్రలో నటిస్తుండగా, త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో శింబు, అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, అశోక్ సెల్వన్, నాజర్, ఢిల్లీ గణేష్, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, సన్యా మల్హోత్రా, జోజు జార్జ్, జిషు సేన్గుప్తా, రోహిత్ సరాఫ్, వైయాపురి మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. సాంకేతిక బృందంలో ఫోటోగ్రఫీ డైరెక్టర్గా రవి కె చంద్రన్, ఎడిటర్గా ఎ శ్రీకర్ ప్రసాద్ మరియు యాక్షన్ కొరియోగ్రఫీని అన్బరివు ద్వయం నిర్వహిస్తున్నారు. ఈ సినిమా మద్రాస్ టాకీస్ మరియు రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ బ్యానర్స్ కింద నిర్మించబడింది. ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. థగ్ లైఫ్ యొక్క అత్యంత ఎదురుచూస్తున్న ఆడియో లాంచ్ ఈవెంట్ మే 24న జరగనుంది.
Latest News