|
|
by Suryaa Desk | Tue, Apr 07, 2026, 12:14 PM
ఉత్కంఠభరితమైన మర్డర్ మిస్టరీ కథాంశంతో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎం4ఎం (M4M – Motive for Murder)’ మే 8న ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో విడుదల కానుంది. అమెరికన్ నటి జో శర్మ, సంబీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్ వడ్లపట్ల స్వీయ నిర్మాణంలో రూపొందించారు. విడుదలకు ముందే ఈ చిత్రం కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రత్యేక స్క్రీనింగ్, ముంబైలోని IMPPA ప్రివ్యూ థియేటర్లో ప్రదర్శన వంటి అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు అందుకుంది. భారతదేశంలో PVR Inox Pictures, అమెరికాలో TekFlix Entertainment, ఉత్తర భారతంలో JVEL Entertainment ఈ చిత్రాన్ని పంపిణీ చేయనున్నాయి.
Latest News