|
|
by Suryaa Desk | Sat, Feb 14, 2026, 03:48 PM
భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ‘రామాయణం’పై నిర్మాత నమిత్ మల్హోత్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హాలీవుడ్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించామని తెలిపారు. భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే లక్ష్యమన్నారు. అత్యున్నత విజువల్ ఎఫెక్ట్స్తో సినిమాను నిర్మిస్తున్నారు. నితేష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ (రాముడు), సాయి పల్లవి (సీత), యశ్ (రావణుడు) నటిస్తున్నారు. సంగీతాన్ని ఏ.ఆర్. రెహమాన్, హన్స్ జిమ్మెర్ అందిస్తున్నారు.DNEG అధినేతగా ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ అందించిన అనుభవంతో, నమిత్ ఈ సినిమాను అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. . రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రంలో మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి థియేటర్లలో సందడి చేయనుంది. ఇది కేవలం సినిమా మాత్రమే కాదని, ప్రపంచ వేదికపై భారతీయుల ఆత్మగౌరవమని ఆయన పేర్కొన్నారు.
Latest News