|
|
by Suryaa Desk | Tue, Oct 21, 2025, 10:18 AM
దీపావళి పండుగ టాలీవుడ్లో సరికొత్త వెలుగులు నింపింది. ఈ పండుగ వేళ అల్లు కుటుంబం నుంచి వచ్చిన ఓ ఫొటో సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అల్లు శిరీష్ తమ కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఈ ఫొటోలో ఓ ప్రత్యేకత అందరి దృష్టినీ ఆకర్షించింది. తన ప్రేమ, పెళ్లి విషయాల్లో గోప్యత పాటిస్తూ వస్తున్న అల్లు శిరీష్, తన కాబోయే భార్య నైనికను ఈ ఫొటో ద్వారా తొలిసారి అభిమానులకు పరిచయం చేశారు.దీపావళి వేడుకల్లో భాగంగా అల్లు కుటుంబం అంతా ఒక్కచోట చేరి సందడి చేసింది. ఈ సందర్భంగా తీసిన ఫొటోలో అల్లు శిరీష్, నైనిక జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ఫొటో బయటకు రావడంతో అల్లు అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఎంతో చూడముచ్చటగా ఉన్న ఈ కొత్త జంటను చూసి 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటివరకు సస్పెన్స్లో ఉన్న శిరీష్ కాబోయే భార్యను చూడటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Latest News