|
|
by Suryaa Desk | Sat, Oct 18, 2025, 06:30 PM
కోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్ తన తదుపరి చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'టెరే ఇష్క్ మెయిన్' అనే టైటిల్ ని లాక్ చేసారు. కృతి సనోన్ ఈ సినిమాలో మహిళా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ని విడుదల చేసారు. ఈ సాంగ్ కి ఇర్షాద్ కామిల్ లిరిక్స్ అందించగా, అర్జిత్ సింగ్ తన గాత్రాన్ని అందించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో స్పెషల్ వీడియోని పోస్ట్ చేసింది. AR రెహ్మాన్ ఈ చిత్రానికి ట్యూన్లను కంపోజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి హిమాన్షు శర్మ మరియు నీరాజ్ యాదవ్ కథ, స్క్రీన్ ప్లే మరియు డైలాగ్లను అందిస్తున్నారు. హిమాన్షు శర్మ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 25, 2025న విడుదల కానుంది.
Latest News