|
|
by Suryaa Desk | Sat, Oct 18, 2025, 06:25 PM
భను భోగవారపు దర్శకత్వంలో మాస్ రాజా రవి తేజా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ రాబోయే ఎంటర్టైనర్ కి 'మాస్ జాతర' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రం చురుకైన వేగంతో అభివృద్ధి చెందుతోంది. ఈ సినిమా అక్టోబర్ 31న విడుదల కానుంది. ఇప్పటికి వరకు ఈ సినిమా నుండి విడుదలైన అన్ని సాంగ్స్ కి భారీ స్పందన లభించింది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్న శ్రీలీల ఈ సినిమాలో తులసి అనే పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో శ్రీలీలా మహిళా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రముఖ తెలుగు నటుడు నవీన్ చంద్ర, ఆది ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారిగా కనిపించనున్నారు. ఈ సినిమాకి సంగీతాన్ని భీమ్స్ సెసిరోలియో ట్యూన్ చేశారు. నాగ వంశి మరియు సాయి సౌజన్య సీతారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ మరియు శ్రీఖర స్టూడియోస్ బ్యానర్లలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Latest News