|
|
by Suryaa Desk | Sat, Oct 04, 2025, 02:45 PM
కోలీవుడ్ నటుడు ప్రదీప్ రంగనాథన్ ప్రముఖ టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ మైథ్రీ మూవీ మేకర్స్ నిర్మించిన యవ్వన ఎంటర్టైనర్ ని ప్రకటించారు. ఈ చిత్రానికి 'డ్యూడ్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రంలో మామిత బైజు మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కీర్తిస్వారాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం యొక్క టైటిల్ మరియు ఫస్ట్-లుక్ పోస్టర్ ని మేకర్స్ విడుదల చేయగా సానుకూల స్పందన వచ్చింది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమాలోని థర్డ్ సింగల్ ని అక్టోబర్ 4న సాయంత్రం 6 గంటలకి సింగారి అనే టైటిల్ తో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సాయి అభ్యంకార్ ఈ సినిమాకి కంపోస్ చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో సీనియర్ నటులు శరత్ కుమార్ మరియు రోహిని మొల్లెటి కీలక పాత్రలలో ఉన్నారు. యంగ్ కోలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ సాయి అభ్యంకార్ ట్యూన్లను కంపోజ్ చేయనున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 17న తమిళం, తెలుగు, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషలలో దీపావళి 2025 సందర్భంగా విడుదల కానుంది.
Latest News