|
|
by Suryaa Desk | Sat, Sep 06, 2025, 02:34 PM
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ఉత్తేజకరమైన హర్రర్ థ్రిల్లర్గా 'కిష్కింధపురి' రూపొందుతోంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ మహిళా ప్రధాన పాత్రలో ఉన్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 12, 2025న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి భారీ స్పందన లభిస్తుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమాలోని నీది నాది ఓ చిరు లోకం సాంగ్ ని ఈరోజు సాయంత్రం 6:03 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. చైతన్ భారద్వాజ్ కంపోస్ చేసిన ఈ సాంగ్ కి పూర్ణ చారి లిరిక్స్ అందించగా, చరణ్ తన గాత్రాణి అందించారు. కౌషిక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఆది, సుదర్శన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దీనిని షైన్ స్క్రీన్లకు చెందిన సాహు గారపతి నిర్మించగా, చైతన్ భారద్వాజ్ సంగీతాన్ని స్వరపరిచారు.
Latest News