|
|
by Suryaa Desk | Mon, Jul 07, 2025, 10:56 AM
పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన రెండో పెళ్లి గురించి వస్తున్న చర్చలకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చారు. రేణు దేశాయ్ మాట్లాడుతూ.. రెండో పెళ్లి చేసుకోవడానికి నేను మానసికంగా సిద్ధంగా ఉన్నాను. కానీ, మరికొన్ని సంవత్సరాల పాటు వేచి చూడాలని నిర్ణయించుకున్నాను. నా జీవితంలో కూడా ఓ మ్యారేజ్ లైఫ్ ఉండాలని, ప్రేమ ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను" అని తెలిపారు.పవన్ తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన పిల్లలు అకీరా నందన్, ఆధ్యాలతో కలిసి జీవిస్తున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె రెండో పెళ్లి అంశం తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని పిల్లల పెంపకానికే కేటాయిస్తున్నానని, వారి భవిష్యత్తుకే తన మొదటి ప్రాధాన్యత అని ఆమె తెలిపారు.
Latest News