|
|
by Suryaa Desk | Wed, Jul 02, 2025, 02:45 PM
డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాద్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో కలిసి ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించారు. ఈ సినిమా ప్రకటన నుండి మూవీ పై భారీ బజ్ ఉంది. ఈ చిత్రానికి 'బిక్షామ్ దేహి' అనే టైటిల్ ని మేకర్స్ ఖరారు చేసినట్లు సమాచారం. ఇటీవల మేకర్స్ ఈ సినిమాని పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ సినిమాలో సంయుక్త మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రంలో టబు, దునియా విజయ్, మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఇప్పుడు నటుడు విజయ్ సేతుపతి ఈ సినిమాలో నటి టబు కలిసి నటించటం గురించి ఓపెన్ అయ్యారు. అయన మాట్లాడుతూ... ఈ చిత్రంలో ఆమెకు ఒక ముఖ్యమైన పాత్ర ఉంది. ఆమె చక్కని నటి. ప్రతిభావంతులైన సహనటుడితో కలిసి పనిచేయడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది ముఖ్యంగా నేను ఇంతకు ముందు పని చేయలేదు అని అన్నారు. ఈ చిత్రాన్ని చార్మ్మే కౌర్ మరియు పూరి జగన్నాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం మరియు హిందీలతో సహా పలు భాషలలో విడుదల అవుతుంది. ఈ చిత్ర సంగీతాన్ని మెలోడీ బ్రహ్మ మణి శర్మ కుమారుడు మహతి స్వర సాగర్ స్వరపరుస్తున్నారు. ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.
Latest News