![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 04:04 PM
హరీష్ శంకర్ దర్శకత్వంలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా షూటింగ్ రానున్న రోజులలో ప్రారంభం కానుంది. గతంలో ఈ సినిమా తమిళంలో హిట్ అయిన "తేరి"కి రీమేక్ అని సమాచారం. తాజాగా ఇప్పుడు మేకర్స్ ఈ సినిమా విషయంలో కొన్ని మార్పులు చేసి ఓన్ స్టోరీగా తెస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ తరువాత పవన్ మరియు హరీష్ శంకర్ మధ్య రెండవ సహకారాన్ని సూచిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల నటించింది. నవీన్ యెర్నేని, రవిశంకర్లు ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు దశరధ్ స్క్రీన్ ప్లే రాస్తున్నారు. అశుతోష్ రానా, గౌతమి, నాగ మహేష్, టెంపర్ వంశీ, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ ఇతరలు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నారు.
Latest News