|
|
by Suryaa Desk | Thu, Oct 23, 2025, 02:26 PM
తన జీవితంలో ఎదురైన కష్టాల సమయంలో కొందరు సంబరాలు చేసుకున్నారంటూ ప్రముఖ నటి సమంత ఆవేదన వ్యక్తం చేశారు. విడాకులు, అనారోగ్య సమస్యలతో తాను తీవ్రంగా బాధపడుతుంటే, తనను ద్వేషించే వాళ్లు ఎగతాళి చేశారని ఆమె ఎమోషనల్ అయ్యారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఆ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ, "నా జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు చూశాను. ముఖ్యంగా నాగ చైతన్యతో విడిపోయినప్పుడు, మయోసైటిస్ బారిన పడినప్పుడు కొందరు పైశాచిక ఆనందం పొందారు. నా భవిష్యత్తుపై వారే నిర్ణయాలు తీసుకున్నట్లు మాట్లాడారు. ఆ వ్యాఖ్యలు మొదట్లో నన్ను చాలా బాధపెట్టాయి, కానీ ఇప్పుడు అలాంటి వారిని పట్టించుకోవడం పూర్తిగా మానేశాను" అని స్పష్టం చేశారు.సమంత చేసిన ఈ వ్యాఖ్యలపై ఆమె అభిమానులు స్పందిస్తున్నారు. ఆమె ధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో మద్దతు తెలుపుతున్నారు. "సమంత ఒక నిజమైన ఫైటర్" అంటూ ఆమెకు అండగా నిలుస్తున్నారు.
Latest News