|
|
by Suryaa Desk | Wed, Oct 22, 2025, 08:26 PM
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఒక చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ రాబోయే ఎంటర్టైనర్ కి మూవీ మేకర్స్ 'ది గర్ల్ఫ్రెండ్' అనే టైటిల్ ని లాక్ చేసారు. దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మానుయేల్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం నవంబర్ 7, 2025న పెద్ద స్క్రీన్లపైకి రానుంది. ఈ సినిమా యొక్క ప్రమోషన్స్ ని మూవీ మేకర్స్ ప్రారంభించారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని అక్టోబర్ 25న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్ మరియు ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిర్మించగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.
Latest News